నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరిన తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు ఆ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది.మొదట తన సొంత పార్టీ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మల్లన్న, తన పార్టీ లీగల్ వ్యవహారాలు కొలిక్కి రాకపోవటంతో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు.
కానీ,కాంగ్రెస్ నాయకత్వం జరిపిన చర్చల తర్వాత పార్టీలో అధికారికంగా చేరటమే కాకుండా ఆ పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా తన భుజాలకు ఎత్తుకున్నారు తీన్మార్ మల్లన్న.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్( CM KCR ) కుటుంబంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే మల్లన్నకు సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
దీంతో ఆయన మాటలకు, ప్రభుత్వాన్ని నిలదీసే విధానాన్ని ఈ ఎన్నికల్లో వాడుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ప్లానే వేసింది.పార్టీలో చేరిన తెల్లారే కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించింది.
అయితే ప్రచార కమిటీ ఛైర్మన్గా ఉన్న మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ బరిలో ఉండటంతో క్యాపెయినింగ్కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు తీన్మార్ మల్లన్న చూసుకోనున్నాడు.ఇప్పటికే రేవంత్ రెడ్డి మాటల తూటలతో ప్రత్యర్థులను బహిరంగ సభలలో నిలదీస్తుండగా,ఆయనకు మల్లన్న తోడవటంతో కాంగ్రెస్ ప్రచారం మరో స్థాయికి చేరనుదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
కన్వీనర్గా నియమిస్తూ వెల్లడించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొనగా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్,ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.నామినేషన్లకు ఈరోజు ఒక్కరోజే సమయం ఉండటంతో ఆ పర్వం పూర్తయిన వెంటనే ప్రచార ప్రక్రియను వేగవంతం చేసేలా ప్లాన్ చేయనున్నారు.