బిడ్డను ఉరేసి చంపింది తల్లి ఉరేసుకుంది

నల్లగొండ జిల్లా:కన్నకూతురును ఉరేసి చంపి తానూ ఉరేసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.టూ టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లకు చెందిన కాటయ్య,జ్యోతి దంపతులు రెండు నెలల క్రితం మిర్యాలగూడకు వలస వచ్చి సీతారాంపురంలో నివాసం ఉంటున్నారు.

 The Mother Hanged Herself Who Killed The Child-TeluguStop.com

కాటయ్య తాపీమేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నారు.వారికి కుమారుడు,కూతురు ఉన్నారు.

కాగా రెండు రోజుల క్రితం కాటయ్య స్వగ్రామం ఆంధ్రాకు వెళ్ళాడు.ఓ కేసులో నిందితుడిగా ఉన్న కాటయ్యను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

ఆ విషయం తెలుసుకున్న భార్య జ్యోతి తన కూతురు అమ్ములు (4) ఉరివేసి చంపి,అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube