నల్లగొండ జిల్లా:వేసవి కాలం సమీపిస్తుండడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.అయితే దీనివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు ముందే హెచ్చరిస్తున్నారు.
వడగాల్పుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ సమస్య వస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం,తల నొప్పి,కంటి చూపు మందగించడం వంటి అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు.
అందుకే ఎండలకు ప్రయాణాలు చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు.