నల్లగొండ జిల్లా:నూతన రేషన్ కార్డుల కోసం అర్హులలైన వారు మీ-సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పించనుంది.
ఈ మేరకు మీ-సేవ డైరెక్టర్కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది.
కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అందులో కోరింది.
అనర్హులు, డూప్లికేట్ దరఖాస్తులను నివారించడంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది.పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తమకు సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించినట్లయింది.