నల్లగొండ జిల్లా: దేశంలో గడియకో గండం అన్న చందంగా రోజురోజుకు మహిళలపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం తమిళనాడు యువకుడు రామకిషోర్ ప్రత్యేక రక్షణ వాచ్ రూపొందించారు.
“దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పి ఫింగర్ ప్రింట్వేసి ఆగంతకుడికి తాకించగానే 5 కిలోవాట్ల కరెంట్ అతడికి ప్రసరించి షాక్తో అచేతన స్థితిలోకి వెళ్లిపోతాడు.
గడియారం సెల్ఫోను అనుసంధానమై ఉన్నందున తల్లిదండ్రులు, పోలీసులకు బాధితురాలు ఎక్కడ ఉందనే సమాచారం వెళ్లిపోతుంది.ఇందులోని బ్యాటరీని అరగంట పాటు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.