నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్ల రిపేర్లు మరియు హ్యామ్ రోడ్ల ఎంపికపై ఎస్ఈలతో శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు,పార్ట్ హోల్ ఫీలింగ్ మెకానైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
హ్యామ్ రోడ్ల ఎంపికలో ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీతో పాటు జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని రోడ్లను ఎంపిక చేయండని సూచించారు.తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్న రహదాలను మాత్రమే హ్యామ్ లో ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యం ఇవ్వండని తెలిపారు.గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రహదారులకు రిపేర్లు జరగకపోవడం వల్ల ఇప్పుడు అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.