నల్లగొండ/గంట సోమన్న:ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్ రూమ్ పైకప్పు పెచ్చులు మీద పడి విద్యార్థికి గాయాలయ్యాయి.తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్దులు రాస్తారోకోకు దిగారు.
ఓయూకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు బంద్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్దులు విసి వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.బాత్ రూంలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని, వెంటనే అధికారులు హాస్టల్ మరమ్మత్తులు చేయాలని కోరారు.