రెండేళ్లైనా పూర్తికాని వంతెన...గ్రావెలింగ్,బిటీ పనులు పెండింగ్

నల్గొండ జిల్లా:పెద్దవూర మండల కేంద్రంలో కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి చిన్న వాగుపై ఉన్న నిజాం కాలం నాటి పాత వంతెన పక్కన రోడ్డు విస్తరణలో భాగంగా నూతన వంతెన ఏర్పాటు చేస్తున్నారు.రెండేళ్ల కిందట రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన వంతెన నేటికీ పూర్తికాకుండా వంతెనపై రెండు వైపులా గ్రావెలింగ్, బిటీ పనులు అలాగే పెండింగ్లో ఉంచారు.ఇంకా 40 శాతం పనులు అసంపూర్తిగా వదలి వేయడంతో నాగార్జున సాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై వంతెన ప్రాంతంలోని గతుకుల్లో ప్రయాణం చేయలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Graveling Of The Bridge Which Has Not Been Completed For Two Years, Bt Works Are-TeluguStop.com

అలాగే కోదాడ-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పెద్దవూర మండల కేంద్రంలో ఒక కిలోమీటర్ దూరం రోడ్డు పనులు నిలిపి వేశారు.ఈ పెండింగ్ పనుల విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

వేసవి కాలం కూడా పూర్తి కావొస్తుంది.ఈ లోగా వర్షాలు కూడా మొదలయ్యాయి,ఈ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని స్థానికులు,వాహనదారులు వాపోతున్నారు.

వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యే నాటికైనా ఈ వంతెన వద్ద పనులు,రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించి రాకపోకలు మెరుగుపడేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని,ప్రజా ప్రతినిధులను మండల ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube