నల్లగొండ జిల్లా:తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు షాక్ ఇచ్చింది.హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అంటూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.2019 కి ముందు బండి అయితే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.బైకులకు రూ.320 నుండి రూ.500 వరకు,ఆటోలకు రూ.350 నుండి రూ.450 వరకు,కార్లకు రూ.590 నుండి రూ.860 వరకు, కమర్షియల్ వాహనాలకు రూ.600 నుండి రూ.800 వరకు నంబర్ ప్లేట్ రేట్లు నిర్ణయించింది.వాహనానికి సెప్టెంబరు 30లోగా నంబర్ ప్లేట్స్ బిగించుకోవాల్సిందేనని,
లేదంటే వాహనాన్ని అమ్మడానికి,కొనడానికి వాహనంపై ఇన్సూరెన్స్, పొల్యూషన్ వర్తించవని,హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రోడ్లపై తిరిగితే పట్టుకోవాలని పోలీసులకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ నంబర్ ప్లేట్స్ కోసం వాహనం ఇన్సూరెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలని ప్రకటించింది.