చింతగూడెంలో యోగా దినోత్సవం

నల్గొండ జిల్లా:అనుముల మండలం యోగాతోనే శారీరక మానసిక దృఢత్వం సాధ్యమవుతుందని ప్రముఖ యోగాచార్యులు మాదగాని శంకరయ్య అన్నారు.

చింతగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రకాల యోగాసనాలు చేస్తూ విద్యార్థుల చేత చేయించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేమారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడాతూ యోగ వలన శరీరము,మనస్సు నియంత్రిత స్థితిలో ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గడ్డం శ్యాంప్రసాద్,ఎండి పాషా, పురం వెంకటయ్య,సాగర్ల సత్తయ్య,పేర్ల వెంకటేశ్వర్లు, దూసరి మధు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!

Latest Nalgonda News