నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో గ్రామగ్రామాన ఏనుగు గుర్తును తీసుకెళ్లి ప్రజలకు పరిచయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బడంపేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శనివారం దేవరకొండ పట్టణంలోని ఎస్ఎస్ మొబైల్స్ మరియు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభానికి వచ్చిన ఆయనకు బీఎస్పీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగా చింతపల్లి మండల కేంద్రంలో డా”బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.అనంతరం కార్యకర్తలతో సమావేశమైన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని,ఏనుగు గుర్తును ప్రజలకు పరిచేయం చేయాలని దిశానిర్ధేశం చేశారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఎర్ర కృష్ణ జాంభవ్,ఇంచార్జి రమేష్ నాయక్,చింతపల్లి మండల కన్వీనర్ చెన్నపాక నరేష్,నియెజకవర్గ అధ్యక్షులు ఎర్ర క్రృష్ణ,నియెజకవర్గ కార్యదర్శి నల్ల ప్రసాద్,ఇంచార్జీ రమేష్ నాయక్, సైదులు,ప్రకాశ్,నవీన్,శ్రీహరి,గణేష్,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.