మంత్రులకు తప్పిన పెను ప్రమాదం!

తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ముఖ్యంగా రైతు మహోత్సవాల( Rythu Mahotsavam ) రూపంలో పంటల ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి.

 Major Mishap Averted For Ministers During Telangana Rythu Mahotsavam Event Detai-TeluguStop.com

అయితే తాజాగా నిజామాబాద్‌లో( Nizamabad ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.మంత్రుల హెలికాప్టర్( Ministers Helicopter ) ల్యాండింగ్ కారణంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవ వేడుకలకు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు,( Tummala Nageswara Rao ) జూపల్లి కృష్ణా రావు,( Jupally Krishna Rao ) ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) హాజరవుతున్నారు.ముందస్తు సమాచారం ప్రకారం సభా ప్రాంగణానికి సమీపంలోని హెలిప్యాడ్‌కి ల్యాండ్ అవుతారని అధికారులు ఏర్పాట్లు చేశారు.

కానీ హెలికాప్టర్ పైలెట్ అనూహ్యంగా సభా ప్రాంగణంలోనే హెలికాప్టర్‌ను దించేశాడు.

Telugu Helicopter, Jupallykrishna, Mallu Ravi, Ministers, Nizamabad, Public Pani

హెలికాప్టర్ రెక్కల గాలి కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము ఎగసిపడింది.దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు నేలకొరిగాయి.ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.

మంత్రులకు పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొంటున్నారు.పంట ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన 150 స్టాళ్లులో కొన్ని ధ్వంసమయ్యాయి.

ఈ క్రమంలో బందోబస్తుకు వచ్చిన కొంతమంది పోలీసులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

Telugu Helicopter, Jupallykrishna, Mallu Ravi, Ministers, Nizamabad, Public Pani

ఇటీవల నాగర్‌కర్నూల్‌లో జరిగిన మరో ఘటనలో కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం తప్పింది.భూభారతి చట్టం-2025 అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్‌లు ప్రయాణించిన హెలికాప్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ అవుతుండగా, బుల్లెట్ ఫైర్ కారణంగా గడ్డిపై మంటలు చెలరేగాయి.అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చొరవతో మంటలు అదుపులోకి తెచ్చారు.

తరచుగా అధికార కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు జరగడం అధికార యంత్రాంగ భద్రతా చర్యలపై ప్రశ్నలు కలిగిస్తోంది.ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యే సభల్లో హెలికాప్టర్ల ల్యాండింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube