క్రైస్తవ మతంలో అత్యున్నత పదవిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్( Pope Francis ) ఇక లేరు.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవుల గుండెల్లో నిలిచిన పోప్.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.న్యూమోనియా( Pneumonia ) వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పోరాడుతూ చివరికి మృతి చెందారు.
ఇది క్రైస్తవ లోకానికి మాత్రమే కాక, సామాజిక న్యాయాన్ని కోరే ప్రతి మనిషికి తీరని లోటుగా భావించవచ్చు.
ఆస్పత్రి నుంచి తిరిగొచ్చిన 24 గంటల్లోనే మరణించారు.
ఈస్టర్ పండుగకు ముందు రోజు పోప్ ఫ్రాన్సిస్ను వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్చారు.డబుల్ న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన చికిత్స తర్వాత ఇంటికి తిరిగొచ్చారు.
కానీ, ఇంటికి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఆయన మరణించారని వాటికన్కు చెందిన కామెరెలెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్( Cardinal Kevin Farrell ) అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే, పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. ఆయన అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో జన్మించారు.కేథలిక్ చర్చిలో( Catholic Church ) ఫాదర్గా తన సేవలను ప్రారంభించిన ఆయన, 2013లో క్రైస్తవుల మత గురువుగా పోప్గా బాధ్యతలు చేపట్టారు.
ఇదే సమయంలో పోప్గా ఎన్నికైన తొలి లాటిన్ అమెరికా వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.

సామాజిక న్యాయం పట్ల పోప్ ఫ్రాన్సిస్ అభిముఖత ఎక్కువ.తన పదవీ కాలంలో పోప్ ఫ్రాన్సిస్ సామాజిక న్యాయం, పేద వర్గాల సంక్షేమం పట్ల విశేష దృష్టి కేంద్రీకరించారు.మతాధికారుల్లో ఆర్థిక పారదర్శకత, అధికారాల దుర్వినియోగంపై తీవ్రంగా స్పందిస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
ధర్మాధిక్షుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరికీ దగ్గరయ్యేలా తన విధులను నిర్వహించారు.విధుల్లో చురుకుగా కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, విధుల్లో మాత్రం ఎప్పటికప్పుడు చురుగ్గా కనిపించేవారు.
పైప్ ద్వారా శ్వాస తీసుకుంటూ అయినా తన భక్తులకు దర్శనం ఇచ్చారు.భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలందించిన పోప్ మరణం ప్రపంచ క్రైస్తవ లోకానికి విషాదాన్ని మిగిల్చింది.
పోప్ ఫ్రాన్సిస్ సేవలను, సానుభూతిని, మానవత్వాన్ని తరతరాలకు గుర్తుండేలా చేస్తాయంటున్నారు క్రైస్తవ మత పెద్దలు.ఆయన మతానికి కాకపోయినా, మానవతకు పోతెత్తిన ఆదర్శమూర్తిగా గుర్తుంచుకుంటారంటూ ప్రపంచ నాయకులు నివాళులర్పిస్తున్నారు.