నల్లగొండ జిల్లా:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన ప్రారంభమైంది.ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు.
పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏఐని వినియోగించుకుంటోంది.