నల్లగొండ జిల్లా:మైనర్లకు వాహనాలు ఇస్తే యజమాని జైలుకెళ్లడం ఖాయమని ఎస్ఐ పసుపులేటి మధు హెచ్చరించారు.నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రం ప్రధాన కూడలిలో వాహన తనిఖీలు చేపట్టి ఎలాంటి పత్రాలు,నెంబర్ ప్లేట్లు లేని 30 వాహనాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి,హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే నేరమని,అందుకు చలానాలు విధిస్తామన్నారు.ఎలాంటి పేపర్లు లేకున్నా, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే వెంటనే వాటిని సీజ్ చేస్తామన్నారు.
ఈ వారం మొత్తం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని వాహనదారులు గమనించాలన్నారు.