నల్లగొండ జిల్లా:మానవ మనుగడలో మంచినీరుకున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కర్లేదు.వేసవి సీజన్లో అయితే మంచినీరు లేకుండా ప్రయాణాలు చేయడం కుదరదు.
దీనితో చల్లటి నీరు తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.దీనికి సహజంగా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్ వాటర్ ను ప్రిపర్ చేస్తుంటారు.
కానీ,ఫ్రిజ్కు బదులు మట్టి కుండ( Clay Pot )లో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.మట్టికుండ నీటిని సహజంగా చల్లగా ఉంచుతుంది.అందులో నీరు కూడా రుచిగా ఉంటాయి.ఆ నీరు తాగితే గ్యాస్,అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావని, జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు.
ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ ( Dehydration )నుంచి తప్పించుకోవచ్చు.జిడ్డు,మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.
అందుకే వేసవి దాహార్తిని తీర్చేందుకు ప్రతీ ఒక్కరూ మట్టికుండలో నీరును తీసుకోవాలని కోరుతున్నారు
.