ప్రపంచంలో ఏ బంధం ప్రేమతో నిండి ఉంటుందంటే, అది తల్లీ-పిల్లల బంధమే.తల్లి ప్రేమ అనేది నిరంతరం నిస్వార్థంగా, అపారంగా ఉండేది.
ఒక తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేయగలదన్న భావన మనకు చిన్ననాటి నుంచే గుర్తింపుగా ఉంటుంది.కానీ, కొన్ని సందర్భాల్లో తల్లి చేతులే పిల్లల పైన హింసగా మారుతున్న ఘటనలు చూస్తే మాత్రం కలత చెందక తప్పదు.
తాజాగా తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల( Jagityal ) పట్టణంలో జరిగిన ఓ హింసాత్మక ఘటన అందరినీ షాక్కు గురిచేసింది.తులసినగర్ ప్రాంతానికి చెందిన శ్రీపెల్లి రమ( Sripelli Rama ) అనే మహిళ తన మూడేళ్ల కొడుకును అతి దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ దారుణం చూసిన వారు ఆ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీడియోలో ఆ తల్లి( Mother ) గత కొన్ని రోజులుగా, కొడుతుండడమే కాక.కాలితో తన్నుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.ఇలాంటి పరిస్థితులు ఆ చిన్నారి ప్రతిరోజూ ఎదుర్కొంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.
అయితే ఈ దృశ్యాలను పొరుగువారు మొబైల్ ఫోన్లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న సఖి సెంటర్( Sakhi Center ) అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.బాలుడిని తన పరిరక్షణకు తీసుకొని కేంద్రానికి తరలించారు.విచారణలో రమ భర్త ఆంజనేయులు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం.
కుటుంబంలో ఉన్న ఒత్తిడులు, మానసిక స్థితి తదితర కారణాలు ఈ హింసకు కారణమైనా, పిల్లల పట్ల తల్లులు తీసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో స్పందన వస్తోంది.
“తల్లి తన పిల్లాడిపై ఇటువంటి హింస ఎదుర్కొనడం బాధాకరం” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.శిశు హక్కుల పరిరక్షణ కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.