నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 30వ తేదీన జరగనుంది.డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు 150కోట్లు అవుతుందని అంచనా.ఎన్నికలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799,పురుష ఓటర్లు 1,62,98,418,మహిళా ఓటర్లు 1,63,01,705,ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676,సర్వీసు ఓటర్లు 15,406,ప్రవాస ఓటర్లు 2,944.35,655 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.దివ్యాంగుల కోసం 21,686 వీల్ చైర్లు సిద్ధం.80ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం.120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు.పోలింగ్ కోసం 1,85,000 సిబ్బంది,22వేల మంది మైక్రో అబ్జర్వర్లు పని చేస్తారు.
ఎన్నికల బందోబస్తు కోసం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలు,50వేల మంది పోలీసు బలగాల ఏర్పాటు.వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్,106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.