నల్లగొండ జిల్లా:దేవరకొండ ( Devarakonda )పట్టణ సమీపంలో గల ఖాదర్ మెమోరియల్ కళాశాల పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులుచిరుత(Leopard )ను చూసి సెల్ ఫోన్లో తీసిన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పరిసర ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు.
దీనితో విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు చుట్ట ప్రక్కల గ్రామాలైన కొండభీమనపల్లి, ముదిగొండ,కమలాపురం, కర్నాటిపల్లి గ్రామాలలో దండోరా వేయించిఆరుబయట ఎవరూ పడుకోవద్దని సూచించారు.
చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు