బాలూ నాయక్ కు మంత్రి పదవి కోసం ఛలో ఢిల్లీ: లంబాడి జేఏసీ

నల్లగొండ జిల్లా: తెలంగాణ మంత్రివర్గంలో లంబాడ బిడ్డకు చోటు కల్పించాలని ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు శుక్రవారం దేవరకొండ నుండి లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లికి బయలుదేరారు.ఈసందర్భంగా లంబాడ జేఏసీ నాయకులు బాబూరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40 నుంచి 50 లక్షల జనాభా ఉన్న లంబాడి సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు ఉండగా ఒక్క మంత్రి పదవి కూడా లేదన్నారు.

 Chalo Delhi For Balu Naik Ministerial Post Lambadi Jac, Chalo Delhi ,balu Naik-TeluguStop.com

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు వినతిపత్రం ఇచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.1970 నుంచి మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తూ వచ్చారని, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదేవిధంగా లంబాడి సామాజిక వర్గానికి చెందిన బాలూ నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.లేనియెడల ఏఐసిసి కార్యాలయాలన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube