నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి దగ్గర నుంచి బస్టాండ్ వరకు కొంతమంది ఆకతాయిలు బైక్స్ పై రౌండ్ కొడుతూ స్టంట్స్ వేస్తున్నారు.ఇంటర్ ఎగ్జామ్స్ ముగించుకొని వెళుతున్న విద్యార్దినులే టార్గెట్ గా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్కొక్క బైక్ పై ముగ్గురు నుంచి నలుగురు యువకులు కూర్చుని ఓవర్ స్పీడ్ తో బైకులు నడుపుతు ఎదురు వచ్చే వాహనదారులు భయాందోళనలకు గురి చేస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు.పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకావాలని కోరుతున్నారు.