నాలుగు శాతం రెడ్లకు ఆరు మంత్రి పదవులు: మందకృష్ణ మాదిగ

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని,బడుగు,బలహీన వర్గాలు రాజ్యాధికారానికి మరింత దూరమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ( MRPS Chief Manda Krishna Madiga ) అన్నారు.ఆదివారం రాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం( Miryalaguda Mandal ) సుబ్బారెడ్డి గూడెం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహావిష్కరణ వేడుకకు రాష్ట్ర రైతు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి( Agros Chairman Vijayasimha Reddy ) తో కలిసి ఆయన హాజరయ్యారు.

 Mrps Chief Manda Krishna Madiga On Minister Posts,minister Posts,mrps Chief Mand-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాలు రాష్ట్ర సాధనలో ఉద్యమిస్తే,ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో ఎవరు పాలకులుగా, ఎవరు బానిసలుగా మారారో అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.సీఎం కేసీఆర్( CM KCR ) రెండు శాతం లేని వెలమల్లో నలుగురికి మంత్రులు,4 శాతం ఉన్న రెడ్లకు ఆరుగురు మినిస్టర్లు ఇచ్చారని,10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఒక్కరికి మినిస్టర్ ఇవ్వలేదన్నారు.

బీసీలకు సైతం అన్యాయం జరుగుతుందన్నారు.ఏబీసీడి వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఖాసీం,అంబటి నాగయ్య, మట్టిమనిషి పాండురంగా రావు,కొమ్ము శ్రీనివాస్, మంద సైదులు,మంద శివ, నాగేష,రమేష్,సతీష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube