నల్గొండ జిల్లా:అనుముల మండలం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ లావూరి బాలు నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విద్యాసంవత్సరం పాఠశాలల ఫీజుల వివరాలను గవర్నమెంట్ బాడీ తీర్మానంలో నిర్ణయించిన విధంగా నోటీసు బోర్డుపై పెట్టాలని,పుస్తకాలు,నోట్ బుక్స్, పెన్నులు స్కూల్ యజమాన్యం విక్రయించరాదన్నారు.25 శాతం పేద విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని,సంబంధిత వివరాలు రికార్డు రూపంలో పొందుపర్చాలన్నారు.ప్రభుత్వ అనుమతులతో బస్సులు నడుపుతూ నిబంధనలు పాటించాలన్నారు.
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నుబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.