నల్లగొండ జిల్లా:పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
దీనిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.సత్యవతి రాథోడ్,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,దాసోజ్ శ్రవణ్ లలో ఇద్దరిని బరిలోకి దించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.