ప్రణయ్ హత్య కేసుపై ఈ నెల 10 న తుది తీర్పు...తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...!

నల్లగొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు చివరి దశకు చేరుకుంది.2018 సెప్టెంబర్ 14న జరిగిన ఈ కేసు విచారణలో తుది తీర్పు ఈ నెల 10న రెండవ అదనపు సెషన్స్ కోర్టు అండ్ ఎస్సీ,ఎస్టీ కోర్టు వెల్లడించనున్నట్లు సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసుపై వచ్చే తీర్పు ఎలా ఉంటుందా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Final Verdict In Prannoy Murder Case On The 10th Of This Month, Final Verdict ,p-TeluguStop.com

తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో అమ్మాయి తండ్రి మారుతిరావు సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే.

ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు మారుతిరావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.కేసు విచారణ నడుస్తుండగానే అమ్మాయి తండ్రి,ఏ1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం కూడా విధితమే.

ఈ కేసులో వచ్చే తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube