నల్గొండ జిల్లా:డిండి ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ లోని ఎర్రగడ్డకు చెందిన మనోజ్ (22) సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే.ఆరుగురి స్నేహితులతో కలిసి శ్రీశైలంలో వినాయక నిమజ్జనం నిమిత్తం వెళ్లి,తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద స్విల్వే వద్ద సెల్ఫీ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
శనివారం సాయంత్రం చీకటి పడటంతో పాటు మోస్తరు వర్షం కురుస్తున్న కారణంగా గాలింపు చర్యలు నిలిపివేశారు.ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టగా మనోజ్ మృతదేహం లభించింది.
విషయం తెలుసుకున్న మృతిని తండ్రి శ్రీహరి,కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమ్మితం ఆసుపత్రికి తరలించి,అనంతరం తల్లిదండ్రులకు అప్పచేపనున్నట్లు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి పోలీసులు తెలిపారు.