నల్లగొండ జిల్లా:తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా టీఎస్పీఎస్సీ( TSPSC ) రెండు రోజులు పొడి గించిన విషయం తెలిసిందే.
ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.గత నెల 23 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.గ్రూప్-1 ప్రిలిమ్స్( Group-1 Prelims ) పరీక్ష జూన్ 9న,మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.