బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడానికి దొంగ రాజకీయాలు: రవిగౌడ్

నల్లగొండ జిల్లా: నిత్య జీవితంలో బతుకుదెరువు కోసం పోరాటం చేస్తున్న సామాన్య ప్రజానీకానికి ఆటంకం కలిగిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని బీజేపి నల్లగొండ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

 Brs Congress Thieving Politics To Deceive People Ravi Goud, Brs, Congress , Ravi-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన పార్టీకి అధ్యక్షుడు ఏదో కూశాడని ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలు చేస్తూ,

దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి రోడ్ల మీదకు వచ్చి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీ నాయకత్వానికి పనిపాటా లేదా అని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రజలను మోసం చేయడానికి దొంగ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.

రేపు దారినపోయే దానయ్య ఏదో ఒకటి వాగితే రోజు ఇదే విధంగా రోడ్లను బ్లాక్ చేస్తారా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పార్టీ,ప్రభుత్వం అభద్రతా భావంతో ప్రజలను ఇబ్బందికి గురి చేయొద్దని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube