అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత

నల్లగొండ జిల్లా: ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను వేములపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు.ఎస్సై దాచేపల్లి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి మండల పరిధిలోని రావులపెంట కామాపల్లె గూడెం మూసి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని

 Four Tractors Illegally Moving Sand Seized, Four Tractors Seized, Illegal Sand M-TeluguStop.com

విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా డ్రైవర్లు ఓనర్లపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలించినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube