మారుతున్న కాలానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.ఇంతకుముందులాగా మనం ప్రాచీన పద్ధతుల్లో వండిన ఆహార పదార్థాలను తినకుండా ట్రెండింగ్ యుగానికి పోతున్నాం.
ఫ్రైలు, జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువయిపోయాయి.నాలుక రుచి కోసం ఆలోచిస్తున్నాం తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాం.
అదే మన కొంప ముంచుతోంది.అయితే కొన్ని సార్లు ఆహారం అతిగా తిన్నా ప్రమాదమే అని చెబుతున్నారు డాక్టర్లు.
ఇప్పుడు కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకునే వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆహార పదార్థాలు మనం తరచూ తినేవే.
అయితే వీటిని అతిగా తింటే మాత్రం చివరకు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు.వీటి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే ప్రాణాలకే ప్రమాదం అని వివరిస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా పఫర్ ఫిష్ ఉంది.ఇది జపనీస్ వంటకం అని చెబుతున్నారు.
జపనీయులు ఇష్టంగా తినే ఈ వంటకంలో ఏ మాత్రం పొరపాటు చేసినా ప్రాణాలే పోతాంయట.దీంతో పాటే బ్లడ్ క్లామ్స్ తినడంలో పొరపాటు చేస్తే టైఫాయిడ్, హెపటైటిస్ లాటి రోగాలు వస్తాయని చెబుతున్నారు.
ఇక మూడోది పచ్చి కిడ్నీ బీన్స్. వీటిని తింటే ఎవరైనా సరే అనారోగ్యం బారిన పడుతారంట.
దెబ్బకు ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు.బ్రెయిన్ శాండ్విచ్ కూడా అత్యంత డేంజర్ అని తెలుస్తోంది.దీన్ని ఆవు దూడ మెదడు నుంచి రెడీ చేస్తారు.అమెరికాలో బాగా పాపులర్ వంటకంగా ఉంది.అయితే దీన్ని తింటే అనేక రోగాలు వస్తాయని చెబుతున్నారు.బర్డ్స్ నెస్ట్ సూప్ కూడా ఇదే కోవలోకి వస్తుంది.
దీన్ని పక్షుల గూడు నుంచి సూప్ చేస్తారు.ఇది చాలా ప్రమాదకరం.
ఇక లాస్ట్ ది పచ్చి జీడిపప్పు.ఇది ఫిట్నెస్ లో భాగంగా వాడుతారు.
అయితే ఇది తింటే ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు డాక్టర్లు.
.