నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు,కవి మరియు పాటల రచయిత యలకా శ్యామ్ సుందర్ రెడ్డి సాహిత్యరంగంలో చేస్తున్న విశేష కృషికి గాను డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారం-2022కు ఎంపికయ్యారు పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండలో మాజీ ఉప ముఖ్యమంత్రి,శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి,ముదుగంటి సుధాకర్ రెడ్డి,ఉపాధ్యక్షురాలు మర్రి శ్వేత తదితరులు పాల్గొన్నారు.