నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో ఓ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు పవర్ ప్లాంట్ లో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది తెలుస్తోంది.ప్లాంట్ లోని పవర్ మేక్ వద్ద ఒక కార్మికుడిని మరో కార్మికుడు అత్యంత పాశవికంగా గొంతుకోసి హత్య చేయడంతో తోటి కార్మికులు షాక్ గురయ్యారు.
మృతుడు అస్సాం రాష్ట్రానికి చెందిన రుతు(46)గా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.