నల్లగొండ జిల్లా:మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటి అయ్యారు.నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటి జరిగినట్లు సమాచారం.
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని జానా భట్టికి సూచించినట్లు తెలుస్తోంది.ఈ భేటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.