హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య:మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్యని, ఇది కాంగ్రెస్ గుండాలు చేసిన పనని,స్వయంగా ప్రభుత్వమే కాంగ్రెస్ గుండాలతో దగ్గరుండి దాడి చేయంచిందని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో జిల్లా పార్టీ అధ్యక్షుడు,దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

 Attack On Harish Rao Camp Office Is A Heinous Act Ex-minister Jagadish Reddy, At-TeluguStop.com

ఎంతో మంది రాక్షసులను తరిమికొట్టినమని,ఇటువంటి చిల్లర వేషాలకు మేము భయపడమని,కేసీఆర్ ముందు ఇవి ఏవి నడవవని, కేసీఆర్ శిఖరం లాంటి వారని అన్నారు.రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ,

ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలు పెట్టిందని, మేము అహింసా పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమం నడిపామని,హింస లేపి ఉద్యమాన్ని అణిచివేయాలని అప్పట్లో ఎన్నో కుట్రలు చేశారని,ఇవ్వాళ రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారని అన్నారు.రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమని మాటిచ్చి,మొదట 50 లక్షల మంది రైతులకు 49 వేల కోట్లతో చేస్తామన్నారు.ఆ తర్వాత రూ.31వేల కోట్లని క్యాబినెట్ లో చెప్పారు.ఆ తర్వాత రూ.27 వేల కోట్లని చెప్పారు,అవి అన్ని మాట తప్పి ఇవ్వాళ రూ.17 వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతులను నిలువునా మోసం చేశారని విమర్శించారు.

ఇవ్వాళ రైతులు తిరగబడుతున్నారని సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, కావాలని ప్రజలను పక్కదారి పట్టించేలా సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ మిమ్ములను దగా చేస్తుంది,మోసం చేసింది, రేవంత్ అనేటోడు బీజేపీతో దొంగ సంబంధాలు పెట్టుకున్నడు,రేవంత్ బీజేపీతో కుమ్మక్కు అయ్యాడు,రేవంత్ ఆంటోడు అల్పజీవి,బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.

నువ్వు దొంగ లాగా బీజేపీతో మిలాఖత్ అయ్యావ్ మేము కాదఅన్నారు.

సమస్యను పక్కదారి పట్టించుడులో రేవంత్ సిద్ధహస్తుడని, రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని రేవంత్ ప్రయత్నం చేస్తోండని,కాంగ్రెస్ చేసిన రుణమాఫీ భయంకరమైన మోసం,పచ్చి అబద్దం,కాంగ్రెస్ నాయకులు అన్నదాతలను దొంగల్లాగా ట్రీట్ చేస్తున్నారని ఆవేదన పడుతున్నారని,రుణాలు ఇచ్చేటప్పుడే అన్ని పత్రాలు సరిచూసుకునే రుణాలు ఇస్తారని,మరి ఇప్పుడు ఇన్ని కొర్రీలు పెట్టి రైతులను ఎందుకు ఎడిపిస్తున్నారని ప్రశ్నించారు.ఇవ్వాళ రుణమాఫీ ఎగ్గొట్టేందుకు అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నది ఈ ప్రభుత్వం,ఇంతకు మించిన ద్రోహం ఇంకోటి ఉండదన్నారు.

రైతుల్లారా అర్థం చేసుకోండి కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి, బీఆర్ఎస్ రైతుల తరపున కొట్లాడుతుంది,మేము అండగా ఉంటామన్నారు.ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలని, అందరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

గ్రామాల్లో రైతులు ఐక్యం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.జిల్లాలో అన్ని పార్టీ కార్యాలయాలు ఉన్న విధంగానే మా పార్టీ ఆఫీస్ కూడా ఉందని,అన్నిటికీ ఉన్న నిబంధనలు మాకు ఉన్నయని, అన్ని పార్టీల లాగానే మేము కార్యకర్తల కోసం దేవాలయం లాంటి ఆఫీస్ ను కట్టుకున్నామని,మా పార్టీ ఆఫీస్ ను కులుస్తాననడం సమంజసం కాదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube