నల్లగొండ జిల్లా:30 ఏళ్ల మాదిగల సుదీర్ఘ పోరాట కలను నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం సాకారం చేసింది.వర్గీకరణపై విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఎస్సీ,ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని,6:1 మెజారిటీతో సంచలన తీర్పు వెల్లడించింది.వర్గీకరణను వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది.ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు.విద్య,ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం,వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం అభిప్రాయపడింది.




Latest Nalgonda News