నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ గురువారం ఇచ్చారు.
టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి వార్తలు వినిపించాయి.
ఈ వార్త ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఆయోమయానికి దారితీసింది.
నిజంగా విద్యా శాఖ ఆ రకమైన ఆదేశాలు జారీ చేసిందా…? లేక పుకారా అనేది అర్దంకాక టీచర్లు అయోమయంలో పడ్డారు.ఈ క్రమంలో విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.