నల్లగొండ జిల్లా:తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు ఈఎన్సీ అనిల్ కుమార్ వెల్లడించారు.ఇవాళ నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష చేపట్టారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు.భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.