టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన అద్భుతమైన సినిమాలలో అతడు( Athadu ) సినిమా ఒకటి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.2005వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఇక ఈ సినిమాని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, జయభేరీ ఆర్ట్స్ పతాకంపై నటుడు మురళీమోహన్ ( Murali Mohan ) ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మురళీమోహన్ బయట పెట్టారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఈ సినిమా కథ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ సినిమాని చేయాలి అనుకున్నప్పుడు ముందుగా నటుడు ఉదయ్ కిరణ్( Uday Kiran ) తో చేయాలని అనుకున్నాము.మొదటి నుంచే ఉదయ్ కిరణ్ ను బాగా దగ్గర చేసే వాడినని, తరుచుగా వచ్చి కలుస్తూ ఉండేవాడని చెప్పారు.ఈ సినిమా చేయాలనుకున్న సమయంలో ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కుమార్తె( Chiranjeevi Daughter ) పెళ్లి చర్చలు జరుగుతూ వచ్చాయి.
ఆయన సినిమా డేట్స్ అన్నీ వేరే టీమ్ చూడటం వల్ల బిజీ అయ్యారని అన్నారు.దాంతో ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమాతో మహేష్ బాబుతో చేసామని మురళి మోహన్ తెలిపారు.