నల్లగొండ జిల్లా: ఫిబ్రవరి 8 ని తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా మార్చి, రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు ఉద్యోగులతో సహా సెలవు ప్రకటించింది.ముస్లింలు పవిత్రమైన రోజుగా జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్టూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది.అయితే ఇప్పుడు ఫిబ్రవరి 8 సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా మార్చింది.
హిందువులు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రంతా ఏ విధంగా అయితే జాగారం చేసి దేవుని ప్రార్థిస్తారో,అదే విధంగా ఫిబ్రవరి 8న ముస్లింలు కూడా రాత్రంతా జాగారం చేస్తారు.అంతేకాదు ఆ రాత్రంతా వారు ప్రార్థనలు చేస్తూ ఉండిపోతారు.
ఇక ఈ షబ్-ఎ-మెరాజ్ పండగ రోజున ఇస్రా,మేరాజ్ల కథను మసీదుల్లో ఉండే వారందరికీ వివరిస్తుంటారు.ముస్లింలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ రోజున తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రేపు (ఫిబ్రవరి 8న) తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి.ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు అస్సలు లేవు.
ఇక వచ్చే నెల అంటే మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉన్నాయి.మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది.మార్చి 25న హోలీ పండగ,మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సెలవులు ఉండనున్నాయి.