నల్గొండ జిల్లా:సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka Mallu )స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు.నల్లగొండ జిల్లా కేతేపల్లికి చేరుకున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర( Peoples March Padyatra )కు నేడు తాత్కాలిక విరామం ప్రకటించారు.
వడదెబ్బ కారణంగా హైఫీవర్ తో బాధపడుతున్న భట్టి విక్రమార్క కు సూర్యాపేట నుండి వచ్చిన వైద్యులు కేతేపల్లి పాదయాత్ర శిబిరంలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి 97 రోజులు కావస్తున్నది.