ప్రభుత్వ పాఠశాలలో బీరు సీసాలు మండలంలో పెరిగి పోతున్న మందు బాబు ల ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మందుబాబుల విక్కృత చేష్టలు ,ఆగడాలు అధికమవుతున్నాయి.మద్యం సేవించుటకు చోటు దొరకనట్లు గా గుడిలో, బడిలో మద్యం త్రాగుతూ ఖాళీ సీసాలు అక్కడే వదిలి వదిలి వెళుతున్నారు.

 Bottles Of Beer In Government Schools Are A Problem For Drug Addicts Who Are Inc-TeluguStop.com

మండలంలోని బండలింగంపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మందు బాబులు బీర్లు త్రాగి ఖాళీ సీసాలు పాఠశాల హాలులో వదిలి వెళ్ళారు.ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాల హాలులో ఖాళీ బీరు సీసాలు కనిపించడం తో వారు ఉపాధ్యాయులకు తెలిపారు.

ఈ సంఘటన ను విడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.గత నాలుగు రోజుల క్రితం బోప్పాపూర్ లోని మళ్లేశు ని గుట్ట పై నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట బీర్లు త్రాగి ఖాళీ సీసాలు అక్కడే వదిలి వెళ్లారు.

మందు బాబులు పవిత్ర స్థలాలు అయిన గుడినీ,బడిని ఎంచుకొని బీర్లు త్రాగడం ఖాళీ సీసాలు అక్కడే వదిలి వెళ్లడాన్ని హిందూ భక్తులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు సంఘటనలు చూస్తుంటే ఎవరో కావాలనే చేస్తున్నట్లుగా కొందరు భావిస్తున్నారు.

పాఠశాలల్లో, దేవాలయాల్లో వాటి పరిసరాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసి ఈ సంఘటనలకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని హిందూ భక్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాద్యాయులు కోరుతున్నారు.మండలంలోనిపోలీస్ అధికారులు కూడా ఈ సంఘటన ల పై దృష్టి సారించాలని ,విచారణ చేపట్టి ఇది మందు బాబుల పనా,హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఎవరయినా కావాలని చేస్తున్నా పనా అన్న అనుమానాలను ఆయా గ్రామాలలోని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

దోషులు ఎవరన్నది గుర్తించి వారిని శిక్షించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube