రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మందుబాబుల విక్కృత చేష్టలు ,ఆగడాలు అధికమవుతున్నాయి.మద్యం సేవించుటకు చోటు దొరకనట్లు గా గుడిలో, బడిలో మద్యం త్రాగుతూ ఖాళీ సీసాలు అక్కడే వదిలి వదిలి వెళుతున్నారు.
మండలంలోని బండలింగంపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మందు బాబులు బీర్లు త్రాగి ఖాళీ సీసాలు పాఠశాల హాలులో వదిలి వెళ్ళారు.ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాల హాలులో ఖాళీ బీరు సీసాలు కనిపించడం తో వారు ఉపాధ్యాయులకు తెలిపారు.
ఈ సంఘటన ను విడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.గత నాలుగు రోజుల క్రితం బోప్పాపూర్ లోని మళ్లేశు ని గుట్ట పై నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట బీర్లు త్రాగి ఖాళీ సీసాలు అక్కడే వదిలి వెళ్లారు.
మందు బాబులు పవిత్ర స్థలాలు అయిన గుడినీ,బడిని ఎంచుకొని బీర్లు త్రాగడం ఖాళీ సీసాలు అక్కడే వదిలి వెళ్లడాన్ని హిందూ భక్తులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు సంఘటనలు చూస్తుంటే ఎవరో కావాలనే చేస్తున్నట్లుగా కొందరు భావిస్తున్నారు.
పాఠశాలల్లో, దేవాలయాల్లో వాటి పరిసరాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసి ఈ సంఘటనలకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని హిందూ భక్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాద్యాయులు కోరుతున్నారు.మండలంలోనిపోలీస్ అధికారులు కూడా ఈ సంఘటన ల పై దృష్టి సారించాలని ,విచారణ చేపట్టి ఇది మందు బాబుల పనా,హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఎవరయినా కావాలని చేస్తున్నా పనా అన్న అనుమానాలను ఆయా గ్రామాలలోని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
దోషులు ఎవరన్నది గుర్తించి వారిని శిక్షించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు
.