స్వప్న శాస్త్రం( science of dreams ) అనేది జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో ఒక భాగం.దీనిలో ఒక వ్యక్తి రాబోయే రోజులలో కలల గురించి వివరాత్మక సమాచారాన్ని పొందుతూ ఉంటాడు.
చాలా కలలు ఒక వ్యక్తికి భవిష్యత్తుకు సంబంధించిన శుభ సంకేతాలను ఇస్తాయి.అయితే కొన్ని కలలు అసహ్యకరమైన సంఘటనల వైపు చూపుతాయి.
చైత్ర నవరాత్రి ఉత్సవాలు మార్చి 22 2023 నుండి మొదలయ్యాయి.ఈ సమయంలో మీ కలలో సింహం, ఏనుగు లేదా దుర్గామాత( Goddess Durga ) స్వయంగా కనిపిస్తే ఈ కలలకు చాలా అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ కలలు శుభమా లేదా ఆ శుభమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం చైత్ర నవరాత్రులలో ఒక వ్యక్తికి కలలో సింహం కనిపిస్తే దుర్గామాత త్వరలో మీతో ప్రసన్నం చేసుకోబోతుందని అర్థం చేసుకోవచ్చు.అంతేకాకుండా దుర్గామాత ఆశీర్వాదంతో మీరు శత్రువులను ఓడించగలరని వారిపై విజయాన్ని సాధించవచ్చు అని అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే స్వప్న శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి కలలో ఏనుగు కనిపిస్తే దుర్గాదేవి త్వరలో మీ ఇంటికి చేరుకోబోతుందని అర్థం చేసుకోవచ్చు.
ఈ సంకేతం కొన్ని పెద్ద విజయాలను కూడా సూచిస్తుందని స్వప్న శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే నవరాత్రి సమయంలో ఒక వ్యక్తి తన కలలో వివాహ వస్తువులను చూస్తే దుర్గామాత ఆశీర్వాదం వారిపై మరియు వారి కుటుంబం పై ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటారని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అమ్మవారి ఆశీస్సులతో దంపతులు సుఖసంతోషంగా ఉండారని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే స్వప్న శాస్త్రం ప్రకారం నవరాత్రులలో కలలో దుర్గామాత కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం ఆ వ్యక్తి పై ఉంటుందని మరియు ఆ వ్యక్తి అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతాడని అర్థం చేసుకోవచ్చు.