మన భారత దేశంలో ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు( Shrines , temples ) ఉన్నాయి.వాటికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుని పూజలు, అభిషేకలు చేస్తూ ఉంటారు.
అలాగే ఆలయాలలో చాలా రకాల ఉత్సవాలు జరుపుతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే శక్తి స్వరూపిణి, మాన్యం దేవత మోద కొండమ్మ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.
పరవశించి పోయే ప్రకృతి మధ్య మోదకొండమ్మ దేవికి ప్రతి సంవత్సరం మే నెలలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు.ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.
డప్పుల దరువులు, దరువులు, తప్పెట గుళ్ళు, భక్తుల గజ్జెల సవ్వళ్ళు, అందాల పాడేరు అంతట ఇప్పుడు ఒకటే సందడి.స్వయంభువుగా కొలువుదిరిన మేదకొండమ్మ దేవి ఉత్సవాలంటే అడవంతా సంబరాలు అంబరాన్ని అంటుతాయి.
మూడు రోజులపాటు ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే మేదం అంటే సంతోషం అని అర్థం.
భక్తుల సుఖసంతోషాలను ప్రసాదించే తల్లి మోద కొండమ్మగా( Moda Kondammaga ) అని ప్రజలు నమ్ముతారు.

కోరిన కోరికలు కొంగు బంగారం పాడేరు గిరిజన దేవత లేదా మోద కొండమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ప్రతి సంవత్సరం మే నెలలో మూడు రోజులపాటు ఉత్సవాలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.మేదకొండమ్మ అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా అనుపు ఉత్సవం కనుల పండుగగా జరిగింది.
అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు.అణువు ఉత్సవాలు చివరి రోజు కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

తెల్లవారుజామున నుంచి మొక్కలు తీర్చుకునేందుకు బారులు తీరారు.ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కలెక్టర్ సమత్ కుమార్( MLA Bhagyalakshmi, Collector Samath Kumar ) తో పాటు ఎస్పీ సిన్హా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు.ఒడిశా, ఛత్తీస్గఢ్ లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
DEVOTIONAL