మన భారత దేశంలో ప్రతి పండుగను అందరూ కలిసి ఒక వేడుకల జరుపుకుంటారు.అలాగే దసరా పండుగ సమయంలో రావణాసుని దహనమే అందరికీ గుర్తొస్తుంది.
కానీ ఈ గ్రామాల ప్రజలు రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారు.అలాగే పాండవుల రాజ్యాన్ని పోగొట్టుకుని వనవాసం చేయాల్సి రావడంతో జమ్మి చెట్టును పూజించి అక్కడే తమ ఆయుధాలను దాచి పెట్టి వనవాసానికి వెళ్లినట్లు మహాభారతంలో ఉంది.
ఆ రోజుల్లో నుంచి దసరా చివరి రోజు నాడు రావణ దహనం చేయడం జమ్మి చెట్టును పూజించడం లాంటివి ప్రజలు చేస్తూ వస్తున్నారు.కానీ ఇక్కడ ఓ మూడు గ్రామాల వారు దసరా పండుగను అసలు జరుపుకోరు.
ఉత్తరప్రేదేశ్లోని, బిస్రాఖ్, బరాగావ్ అనే రెండు గ్రామాలు రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారు.ఉత్తరప్రేదేశ్లోని బాగాపత్ జిల్లాలో బరాగావ్ అనే గ్రామం ఉంది.
ఆ గ్రామానికి చెందిన ప్రజలు రావణుడిని దైవంగా కొలుస్తారు.
పురాణ ప్రకారం,రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి శక్తి వరంగా పొందాడు.
తనతో శక్తిని తీసుకువచ్చేటప్పడూ ఈ గ్రామం గుండా వెళ్లినట్లు ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు.అయితే ఆ గ్రామం నుంచి వెళుతున్న రావణుడు భరించలేనంత శక్తి ఉండడం వల్ల ఆ గ్రామంలోని ఒక రైతుకు కొంత శక్తిని ఇచ్చాడని, ఆ రైతు ఆసక్తిని నేలపై పెట్టినట్టు ఆ గ్రామస్తులు నమ్ముతారు.
దానితో ఆసక్తి రావణుడితో తిరిగి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఏ ప్రదేశంలో శక్తి నేలపై పెట్టారో అక్కడ మానస దేవి ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నట్లు అక్కడి పూజారులు చెబుతున్నారు.
మనదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని బిస్రాఖ్ వాసులు కూడా బరాగావ్ గ్రామ వాసుల అలాగే దసరా పండుగ ను వ్యతిరేకిస్తారు.అయితే ఈ గ్రామంలో రావణ, మేఘనాథ్, కుంభకర్ణులను దహనం చేసేందుకు అసలు ఒప్పుకోరుట.ఎందుకంటే పురాణాల ప్రకారం విశ్రవ రుషికి జన్మించిన రావణుడి బాల్యం బిస్రాఖ్లో జరిగింది.
కాబట్టి ఈ గ్రామాలకు రావణుడే దేవుడు.
LATEST NEWS - TELUGU