నల్లగొండ జిల్లా:ఇకపై ప్రతి రోజు మండల కేంద్రంలో ఉండేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో సొంతిల్లు ఏర్పాటు చేసుకున్నారు.ఆదివారం శాస్త్రోత్మకంగా తన సతీమణి లక్ష్మితో కలిసి వేదపండితుల ఆశీర్వచనాల మధ్య హోమాలు,పూజలు నిర్వహించారు.
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వచ్చిన దాదాపు పదివేల మంది కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసి వారికి స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతి రోజు తన వసతి గృహం వద్దే రెండు వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ ఫోటోకి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ కన్వీనర్,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు.