ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి:నూనె

నల్లగొండ జిల్లా:ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని,చివరకు ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినా, ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదని,వెంటనే కేంద్రాలను ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.శనివారం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల,వట్టిమర్తి, వనిపాకల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

 Grain Purchasing Centers Should Be Started: Oil-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుమడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంకాగా, వట్టిమర్తి,వనిపాకలలో నేటికీ ప్రారంభంకాలేదని, వనిపాకలకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని,వెంటనే ఇవ్వాలని కోరారు.వరిపంట సగానికి సగం వేయలేదని,వేసిన కొంత భాగం మిల్లర్లకు అమ్మారని, స్వర్ణ,సన్నాలను ఇంకా కోయలేదని,కనీసం మార్కెట్లలో పోసిన ధాన్యానికి కూడా అతిగతీ లేదని విమర్శించారు.

ఏమాత్రం ఆలస్యమైనా వడగళ్ల వర్ష బీభత్సం వల్ల మళ్లీ రైతాంగం కన్నీరుమున్నీరయ్యే ప్రమాదం ఉన్నందున ప్రకృతి బీభత్సాలు సంభవించకముందే కొనుగోళ్లను పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఆర్పీఎస్ జిల్లా నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube