జార్జియాలోని టిబిలిసి(Tbilisi, Georgia) వీధుల్లో ఊహించని అద్భుతం జరిగింది.ఓ జార్జియా వీధి సంగీత విద్వాంసుడు భారతీయ యాత్రికురాలిని ఆశ్చర్యపరుస్తూ, బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ ‘మేరా జూతా హై జపానీ’(Bollywood classic song ‘Mera Joota Hai Jaapani’)ని అద్భుతంగా పలికాడు.
ఈ సంగీత ప్రదర్శనను వీడియో తీయగా, అదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ, సోషల్ మీడియాలో ఎందరి హృదయాలనో గెలుచుకుంటోంది.
ఈ వీడియోను గ్లోబల్ ట్రిప్స్లోని ఆసక్తికర విషయాలను పోస్ట్ చేసే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ @listenshreyaaa షేర్ చేసింది.
ఈ క్లిప్లో, జార్జియా వ్యక్తి అకార్డియన్ వాయిస్తూ, 1955లో విడుదలైన రాజ్ కపూర్ సినిమా ‘శ్రీ 420’లో ముకేష్ పాడిన ఐకానిక్ పాటను పాడుతున్నాడు.
ఈ దృశ్యం చూసి షాకైన శ్రేయ, తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.“టిబిలిసిలో ఓ సాధారణ వైట్ పర్సన్, మీ కజిన్స్/ఫ్రెండ్స్ (Your cousins/friends)అంతాక్షరిలో పాడటం కన్నా పాత బాలీవుడ్ను బాగా పాడుతున్నాడు” అని సరదాగా రాసింది.2025లో ఓ జార్జియా వ్యక్తి ఈ హిందీ క్లాసిక్ను పాడుతున్నాడని తాను ఎప్పుడూ ఊహించలేదని జోక్ చేసింది.ఆ సంగీత విద్వాంసుడికి టిప్ ఇచ్చి, ‘నేను ఆర్ట్కు నిధులు సమకూర్చాను’ అని సరదాగా అంది.
చాలా మంది నెటిజన్లు కేవలం సంగీతానికే కాదు, ఆ పాటలోని సాహిత్యం అర్థాన్ని ఆ సంగీత విద్వాంసుడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడో చూసి ఫిదా అయ్యారు.ఈ వీడియో బాలీవుడ్కు, పూర్వ సోవియట్ యూనియన్కు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తోంది.USSR కాలంలో, పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి సమతుల్యం చేయడానికి భారతీయ సినిమాలను విస్తృతంగా ప్రోత్సహించేవారు.
రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి(Raj Kapoor, Mithun Chakraborty) వంటి వారి బాలీవుడ్ సినిమాలు అక్కడ విపరీతంగా ప్రజాదరణ పొందాయి. ఆవారా (1951), శ్రీ 420 (1955) వంటి సినిమాలు రాజ్ కపూర్ను ఆ ప్రాంతంలో సూపర్ స్టార్గా చేశాయి.