నల్గొండ జిల్లా:మునుగోడు మండలం ఊకొండి శివారులో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.బైకుపై వెళ్తున్న యువకుడిపై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.భాదితుడు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెళ్ళెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,దుండగుల కోసం వేట సాగిస్తున్నారు.