నల్గొండ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం..!

నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది.మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి 41 మంది అనుకూలంగా ఉండగా ఐదుగురు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది.జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన ఓటింగ్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా 41, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఐదు ఓట్లు వచ్చాయి.

ఒకరు తటస్థంగా ఉండగా.మిగిలిన సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది.ఈ నేపథ్యంలో నల్గొండ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది.

Advertisement
చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు