నల్లగొండ జిల్లా:మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలలో నేటి ఉదయం భారీ భూకపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదైంది.ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.
దీని తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలాయి.ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు.
మరికొందరు ప్రాణాలు రక్షించేందుకు ఈత కొలనులలో దూకారు.
ఇక బ్యాంకాంక్ లో ఈ భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది.ఈ నగరంలో అనేక భవనాలు నేలమట్టమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
సహాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.వందలాది మంది క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.కాగా ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.







